Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.15 లక్షలు నజరానా ప్రకటించిన బీసీసీఐ

Webdunia
న్యూజిలాండ్ పర్యటనలో 41 ఏళ్ల తరువాత టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా సభ్యులకు బీసీసీఐ మంగళవారం ఒక్కొక్కరికి రూ.15 లక్షల బోనస్ ప్రకటించింది. విజయావకాశాలు పుష్కలంగా ఉన్న వెల్లింగ్టన్ టెస్ట్‌ను వర్షం కారణంగా టీం ఇండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ గడ్డపై తాజా టెస్ట్ సిరీస్‌ను టీం ఇండియా 1-0తో కైవసం చేసుకుంది.

ఈ చారిత్రాత్మక విజయం సాధించిన జట్టుకు వెంటనే బీసీసీఐ బోనస్ ప్రకటించింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను కూడా టీం ఇండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిరస్మరణీయ విజయాలు సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అభినందించారు.

టెస్ట్, వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుల్లోని ఒక్క ఆటగాడికి రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల బోనస్ ప్రకటించారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నేతృత్వంలోని భారత జట్టు 1967- 68లో చివరిసారి న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మళ్లీ టెస్ట్ సిరీస్ విజయాన్ని మహేంద్ర సింగ్ ధోనీ సేన సాధించింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా 3-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments