Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచీ దేవాలయంలో టీమిండియా కెప్టెన్ ధోనీ పూజలు!

Webdunia
రాంచీకి సమీపంలోని ప్రఖ్యాత దేవోరి దేవాలయంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పూజలు చేశారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లోనూ, ఆ తర్వాత శ్రీలంకతో కలసి ముక్కోణపు సిరీస్‌లోనూ పాల్గొనేందుకు జట్టులోని ఇతర సహచరులతో కలిసి ఈ నెల 12వ తేదీన ఆసీస్‌కు బయలుదేరి వెళ్లనున్న ధోనీ ఈ పర్యటన దిగ్విజయంగా కావాలని అమ్మవారికి పూజలు చేశాడు.

క్రికెట్‌లో ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ముందే ధోనీ తరచుగా ఈ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందేవాడని అతని సన్నిహితులు, ఆలయ పూజారులు చెబుతున్నారు.

కాగా, ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్, ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్, హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వివిఎస్.లక్ష్మణ్ సహా టీమిండియాలోని ఏడుగురు సభ్యులు బుధవారం రాత్రే బయలుదేరి వెళ్లిన విషయం విదితమే. జట్టులోని మిగిలిన సహచరులతో కలిసి కెప్టెన్ ధోనీ ఈ నెల 12వ తేదీన చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు బయలేదేరి వెళ్లనున్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments