Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో టెస్టులో గెలుపు మాదే: కిర్‌స్టెన్

Webdunia
న్యూజిలాండ్‌ జట్టుతో వారి సొంత గడ్డపై జరిగే మూడో టెస్టులో గెలుపు సాధించి తీరుతామని 'టీమ్ ఇండియా' కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. వాతావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా తమ ఆటగాళ్లు రాణిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో పిచ్ సీమర్లకు అనుకూలించడమే కాకుండా, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం భారత పేసర్లకు అనుకూలించే అంశమని ఆయన చెప్పుకొచ్చాడు.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కివీస్-భారత్‌ల మధ్య శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు జరుగనుంది. ఇప్పటికే 1-0తో సిరీస్ ఆధిక్యాన్ని కూడబెట్టుకున్న భారత్.. చివరి టెస్టులోనూ గెలిచి కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. అయితే, టెస్టు జరిగే వెల్లింగ్టన్‌లో ఉండే వాతావరణమే భారత్‌ ఆటగాళ్లను భయపెడుతోంది.

విపరీతమైన చలిగా ఉండటం ధోనీ సేను పెను సవాల్‌గా మారింది. దీనిపై కిర్‌స్టెన్ మాట్లాడుతూ.. పిచ్, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా ఆటగాళ్ల ప్రదర్శనే కీలకం. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాణించేందుకు తమ కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. ముగిసిన రెండు టెస్టుల్లోనూ ఇదే నిరూపించారని కిర్‌స్టెన్ చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments