Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఇండియన్స్‌లోనే సచిన్, భజ్జీల స్థానం పదిలం!

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో ఆడే ముంబై ఇండియన్స్ జట్టులో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్‌లు తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సచిన్, భజ్జీలతో పాటు మలింగా, పోలార్డ్‌లు సైతం ముంబై ఇండియన్స్ జట్టులో యధావిథిగా కొనసాగుతారు.

ఐపీఎల్ నాలుగో సీజన్ కోసం ఆడే క్రికెటర్ల కోసం వేలం పాట జరుగనున్న నేపథ్యంలో, ఆయా యాజమాన్యాలు తమ మాజీ క్రికెటర్లను జట్టులోనే పదిలం చేసుకునేందుకు సన్నాహాలు మొదలెట్టాయి. ఈ క్రమంలో తమ జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను అదే జట్టులో కొనసాగించేందుకు బీసీసీఐ గడువు విధించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇద్దరు విదేశీ ఆటగాళ్ల స్థానాన్ని పదిలం చేసుకోవచ్చు.

దీంతో కెప్టెన్ సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, మలింగా, పోలార్డ్‌లు ఐపీఎల్-4లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతారని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా షేన్ వార్న్, షేన్ వాట్సన్‌ల కాంట్రాక్టును పొడిగించింది. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ తరపున వీరిద్దరూ ఐపీఎల్ నాలుగో సీజన్ బరిలోకి దిగనున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments