టీమ్ ఇండియా కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రశంసల జల్లు కురిపించారు. మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరు ఆవేశపరుచే, ఉద్వేగపరిచే విధంగా ఉంటుందన్నారు. క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ 'ఎంటర్టైనింగ్ క్రికెటర్' అని ముషారఫ్ కితాబిచ్చారు.
అలాగే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నియమానుసార క్రికెటర్ అని, ధోనీ మాత్రం ఎంటర్టైనింగ్ మరియు ఉద్వేగపరిచే క్రికెటర్ అని ముషారఫ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇంకా మహేంద్ర సింగ్ ధోనీ గురించి ముషారఫ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ధోనీ హెయిర్ స్టైల్పై ప్రశంసల వర్షం కురిపించాను. ఇప్పుడు షార్టర్ హెయిర్కట్తో అతని హెయిల్ స్టైల్ మారిపోయిందని ముషారఫ్ అన్నారు. హెయిర్ స్టైల్ మారిన ధోనీ ఆటతీరు ఉద్వేగపరిచే విధంగా ఉంటుందనే చెప్పారు.
కానీ తమ పాకిస్థాన్ క్రికెట్ను చూస్తే మాత్రం లోలోపల బాధపడుతానని, అయితే భారత క్రికెట్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటుందని ముషారఫ్ వెల్లడించారు. పాకిస్థాన్ క్రికెట్ రోజు రోజుకి వివాదాల వలయంలో చిక్కుకుని దిగజారిపోతోందని ముషారఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.