Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ప్రపంచకప్‌ : లంకపై భారత్‌ విజయం

Webdunia
సిడ్నీలో జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్‌‌లో భారత జట్టు హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ శ్రీలంక జట్టుపై 35 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్‌-బీలో భారత్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ గోస్వామి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 137 పరుగులు సాధించింది. కాగా, లంక బౌలర్ల ధాటికి భారత టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ కుప్పకూలినా.. తెలుగుతేజం మిథాలీ రాజ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. 120 బంతులు ఎదుర్కొన్న ఆమె ఒక బౌండరీతోపాటు 75 పరుగులు సాధించి, చివరి వరకు అజేయంగా నిలిచింది. చివర్లో గోస్వామి (24 నాటౌట్‌) మిథాలీకి చక్కటి సహకారాన్ని అందించింది.

ఆ తరువాత... 138 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్‌ఉమెన్‌ భారత బౌలర్ల జోరుకు క్యూ కట్టారు. దీంతో 44.2 ఓవర్లలో లంక 102 పరుగులకే ఆలౌట్‌ అయింది. జట్టులో కౌలస్య 20, సిల్వా 21 పరుగులు మినహా, మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరును సాధించలేకపోయారు. భారత బౌలర్లలో హైదరాబాదీ బౌలర్‌ సుల్తానా 10 ఓవర్లు బౌలింగ్‌ చేసి 16 పరుగులిచ్చి, రెండు వికెట్లు తీసుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ది ఉమెన్‌ అవార్డు మిథాలీరాజ్‌కు దక్కింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Show comments