Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 7-8 నెలలు ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు: బీసీసీఐ

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2009 (12:45 IST)
మరో ఏడు, ఎనిమిది నెలల పాటు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్‌కు స్పష్టం చేశారు. అయితే వచ్చే యేడాది పరిస్థితులు చక్కబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ హామీ ఇచ్చారు.

మొహాలీలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే సందర్భంగా ఇజాజ్ భట్, శశాంక్ మనోహర్‌లు సమావేశమై, పాక్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించే అంశంపై చర్చించారు. ఆ సమయంలో మరో ఏడు ఎనిమిది నెలల పాటు ఇది సాధ్యపడబోదని ఆయన భట్‌కు మనోహర్ తేల్చి చెప్పారు.

ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లపై ప్రభుత్వ అనుమతి లేనిదే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని బీసీసీఐ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా తెలిపారు. ఇరు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించాలని భట్ పట్టుబడుతుండగా, మనోహర్ మాత్రం అలాంటి పరిస్థితి ఇప్పట్లో లేదన్నారు. ఎందుకంటే 7, 8 నెలలో పాటు భారత జట్టు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments