Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెట్టింగ్ ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తా: మోడీ

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2010 (10:15 IST)
PTI
తనపై చేస్తున్న బెట్టింగ్ ఆరోపణలపై పరువు నష్టం దావా వేయనున్నట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమిషనర్ లలిత్ మోడీ హెచ్చరించారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని పత్రికలు ఊహాజనిత కథనాలను రాస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు.

అంతేకాకుండా, ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో జోరుగా బెట్టింగ్‌లు చోటు చేసుకున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాజా వ్యవహారంపై ఆయన స్పందిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగం ఐపీఎల్ మ్యాచ్‌ల తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు.

ఐపీఎల్ టోర్నమెంట్‌లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావులేదన్నారు. ఒక పత్రిక ఉద్దేశపూర్వకంగా తనను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు వార్తా కథనాన్ని ప్రచురించిందని ఆరోపించారు. ఆ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయిస్తానని, పరువునష్టం దావా వేస్తానని మోడీ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments