Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ నిర్ణయంపై మిల్స్ ఆగ్రహం

Webdunia
టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వికెట్‌ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌లను ఎన్‌జెడ్‌పీసీఏ-ఏసీఏ మాస్టర్స్ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అనుమతించకపోవడంపై న్యూజిలాండ్ క్రికెట్ సంఘం చీఫ్ హీత్ మిల్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడుతున్న హిమేష్ మార్షల్ ఉన్నందున సచిన్, దినేశ్ కార్తీక్‌లను ల్గొనరాదంటూ.. బీసీసీఐ ప్రకటించిన సంగతి విదితమే. దీనికి ప్రతిస్పందనగా కివీస్ క్రికెటర్ల సంఘం సీఈవో మిల్స్ మాట్లాడుతూ.. సచిన్, దినేశ్‌లను ఈ మ్యాచ్‌లోకి ఆడేందుకు అనుమతించకుండా బీసీసీఐ మూర్ఖంగా వ్యవహరిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

టీం ఇండియా ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ఆడతారని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సంతోషంగా ఉన్న సమయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తమను ఆశ్చర్యపరచిందనీ మిల్స్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో ఆడుతున్నవారిలో అండర్-19 క్రికెటర్లు కూడా ఉన్నారనీ, అటువంటి ఆటగాళ్లు సచిన్ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్‌‍కు బౌలింగ్ చేసే అవకాశాన్ని గొప్పగా భావిస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం వారందరినీ తీవ్రంగా నిరాశపరచిందని మిల్స్ వాపోయాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

Show comments