Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ క్రికెటర్ల షర్ట్‌లపై స్పాన్సర్ల లోగో మాయం

Webdunia
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ దేశ క్రికెట్ స్పాన్సర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంకతో ఇటీవల జరిగిన తొలి రెండు వన్డేల్లో పాక్ క్రికెటర్లు ధరించిన చొక్కాలపై స్పాన్సర్ల లోగో కనిపించకపోవడం వివాదాస్పదమైంది. స్పాన్సర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాక్ బోర్డు హుటాహుటిన లోగోలు ఉన్న చొక్కాలను శ్రీలంక పంపించింది.

ఆదివారం శ్రీలంక పర్యటనకు బయలుదేరిన పాకిస్థాన్ ఎ జట్టుతో ఈ కొత్త కిట్‌లను పంపించారు. ఈ కిట్‌లు పాక్ క్రికెటర్లకు మూడో వన్డే ప్రారంభానికి కాసేపటి ముందు అందాయని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

తొలి రెండు వన్డేల సందర్భంగా ఆటగాళ్లు ధరించిన చొక్కాలపై లోగోలు మాయమవడం పట్ల స్పాన్సర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. వన్డే సిరీస్‌కు మొదట పంపిన కిట్‌లలో ఆటగాళ్ల చొక్కాలపై లోగోలు ఉన్నాయో లేదో సంబంధిత యంత్రాంగం పరిశీలించకపోవడం వలనే ఈ తప్పు జరిగిందని పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments