Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపియర్ టెస్ట్: గంభీర్ సెంచరీ.. సచిన్ రాణింపు

Webdunia
నేపియర్‌లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు‌లో ఓపెనర్ గౌతంగంభీర్ (102 నాటౌట్) సెంచరీ భారత జట్టును ఆదుకున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగుల వెనుకబడి ఫాలోఆన్ ఆడుతున్న భారత్ కోలుకుంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో భారత్ తడబడినా గంభీర్ సెంచరీతో, రాహుల్ ద్రావిడ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్, సచిన్ టెండూల్కర్ అర్థ సెంచరీతో రాణించడంతో నాలుగురోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.

మరో ఆట మాత్రమే మిగిలి వుండగా, భారత్ మరో 62 పరుగుల వెనుకబడి వుంది. గంభీర్ (102), సచిన్ (58)లు క్రీజులో ఉన్నారు. ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో చివరి రోజు అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే ఈ టెస్టు డ్రా అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అంతకుముందు ఓ వికెట్ నష్టానికి 47 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆట కొనసాగించిన భారత్‌ 163 పరుగులవద్ద ద్రావిడ్ (62) వికెట్‌ను మాత్రమే కోల్పోయింది. ద్రావిడ్ తర్వాత గంభీర్‌కు సచిన్ జతకలిశాడు.

వీరిద్దరు వికెట్లు కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో భారత జట్టు నాలుగో రోజంతా ఆడినప్పటికీ కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 619 పరుగుల భారీస్కోరు చేసి డిక్లెర్ చేసిన సంగతి తెలిసిందే. బదులుగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 305 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments