మూడు వన్డేల సిరీస్లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి వన్డే సోమవారం అబుదాబీలో జరుగనుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్లలో ఇరు జట్లూ తలా ఒక మ్యాచ్లో గెలుపొందిన విషయం తెల్సిందే. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే సోమవారం జరుగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంభంకానుంది.