Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తొలి ట్వంటీ-20 మ్యాచ్ : భారత్ - కివీస్ జట్లు సిద్ధం!

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2012 (10:33 IST)
File
FILE
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ట్వంటీ-20 మ్యాచ్ జరుగనుంది. రెండు ట్వంటీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి ట్వంటీ-20 మ్యాచ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సముద్రతీరంలో ఉన్న వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు రెండు రోజుల క్రితమే విశాఖకు చేరుకున్న విషయం తెల్సిందే.

ఈ ట్వంటీ-20 సిరీస్‌కు ముందు.. టెస్టు సిరీస్‌ను విజయవంతంగా క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా... ధనాధన్ క్రికెట్‌కు సిద్దమైంది. రెండు మ్యాచ్‌లో టీ-ట్వంటీ సిరీస్‌కు ధోనిసేన సమాయత్తమైంది. శ్రీలంక వేదికగా ఈనెలలో జరుగనున్న పొట్టి క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు ఈ సిరీస్ జరుగుతుండటంతో దీనికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది.

లంకలో జరుగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలంటే... స్వదేశంలో జరుగుతోన్న ఈ సిరీస్‌లో ధోని గ్యాంగ్‌ విజయం సాధించి తీరాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌ శుక్రవారం జరుగుతుండగా, రెండో మ్యాచ్ ఈనెల 11వ తేదీ చెన్నయ్‌లోని చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇకపోతే.. ట్వంటీ-20 రికార్డుల పరంగా చూస్తే.. ఇండియాపై న్యూజీలాండ్‌దే పైచేయిగా ఉంది. కివీస్‌ టీమ్‌తో భారత్ మూడుసార్లు తలపడగా... అన్నింటిలోనూ పరాజయాలే ఎదురయ్యాయి. ఈ సారి స్వదేశంలో జరుగనుండటం ధోనీ సేనకు అడ్వాంటేజ్‌. టెస్టు సిరీస్ నెగ్గిన ఊపులోనే ట్వంటీ-20లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments