తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ నెంబర్వన్ ర్యాంక్కు సమీపించాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న యువరాజ్ సింగ్ నెంబర్వన్ ర్యాంక్లో ఉన్న టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అతిచెరువలో ఉన్నాడు. ధోనీ వన్డే ర్యాంకింగ్స్లో చాలాకాలం నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా తన సహచరుడి నుంచే ధోనీ స్థానానికి ముప్పు ఏర్పడింది. ధోనీకి ఇప్పుడు యువరాజ్ సింగ్ కేవలం 44 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న యూవీ ప్రస్తుతం 784 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ 828 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలలో మెరుగ్గా రాణిస్తే యువీకి టాప్ ర్యాంకును అందుకోవడం కష్టం కాకపోవచ్చు.