Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవాళీ పోటీల్లో స్టార్ ఆటగాళ్లు: యూనిస్

Webdunia
దేశీయ టోర్నీల్లో స్టార్ ఆటగాళ్లు పాల్గొనాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్ పిలుపునిచ్చాడు. దీనివల్ల క్రికెట్ ఆట దేశంలో తిరిగి పుంజుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాద దాడుల సంఘటనతో దేశంలో క్రికెట్ అడుగంటి పోరాదని వ్యాఖ్యానించాడు.

కరాచీలో విలేకరుల సమావేశంలో యూనిస్ మాట్లాడుతూ, లాహోర్ ఘటన తర్వాత క్రికెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నాడు. ఈ సమయంలో దేశవాళీ పోటీల్లో స్టార్ ఆటగాళ్లు పాల్గొనాల్సిన కీలక సమయం ఇదేననిఅభిప్రాయపడ్డాడు. గత అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం నేర్చుకోవలసింది చాలా ఉందని హబీబ్ బ్యాంక్ జట్టుకు సారథ్యం వహిస్తున్న యూనిస్ విశ్లేషించాడు.

అనేక మంది యువకులకు జీవిత లక్ష్యంగా ఉన్న క్రికెట్‌ను దేశంలో తెరమరుగు అవ్వకుండా అడ్డుకోవలసిన అవసరం ఉందన్నాడు. తనకు తెలిసి ప్రస్తత దేశీయ వన్డే పోటీలు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోను నిర్వహించడం విశేషంగా తెలిపాడు. ఇందులో ఆటగాళ్లు పూర్తి స్థాయిలో పాల్గొనడం ద్వారా పాక్‌లో క్రికెట్ బాగా ఉందనే సందేశాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

Show comments