దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో ఆడేందుకుగాను సీనియర్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ మరియు జార్ఖండ్ డైనమేట్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలతో కూడిన భారత టెస్టు క్రికెట్ జట్టు సౌత్ ఆఫ్రికాకు బయలుదేరింది. సచిన్, ధోనీలతో కూడిన 9 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాకు ప్రయాణమైంది.
ఈ జట్టులో ధోనీ, టెండూల్కర్లతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, శ్రీశాంత్, వృద్ధిమాన్ సహా, సురేష్ రైనా, ఇషాంత్ శర్మ జట్టు మేనేజర్ బిస్వాల్లు ఉన్నారు. దుబాయ్ నుంచి దక్షిణాఫ్రికాకు చేరుకునే ఈ జట్టు డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో తలపడనుంది.
ఇంతకుముందే దక్షిణాఫ్రికా పిచ్లను పరిశీలించేందుకు టీమిండియా ప్లేయర్స్ పుజారా, జయదేవ్, ఉమేష్ యాదవ్లతో పాటు గ్యారీ కిర్స్టెన్లు సౌత్ ఆఫ్రికా చేరుకున్నారు. అలాగే రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్లు మంగళవారం దక్షిణాఫ్రికా వెళ్లారు.