Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి మ్యాచ్‌లోనే ధోనీసేనకు గట్టి షాక్ తప్పదు..!: ఆఫ్ఘన్ కోచ్

Webdunia
FILE
కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు గట్టి షాక్ ఇస్తామని ఆప్ఘనిస్థాన్ కోచ్ ఖబీర్ ఖాన్ హెచ్చరించాడు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీం ఇండియాకు ఐసీసీ ట్వంటీ-20 ప్రారంభ మ్యాచ్‌లోనే ఆశ్చర్యకరమైన అంశాలతో షాకిస్తామని ఖబీర్ తెలిపాడు.

శనివారం జరిగే ఐసీసీ ట్వంటీ-20 తొలి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సేన ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. తొలిసారిగా ఐసీసీ ట్వంటీ-20 మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన ఆప్ఘనిస్థాన్‌ జట్టుకు.. టీం ఇండియాపై గట్టిపోటీనిచ్చే సత్తా ఉందని ఖబీర్ అన్నాడు.

ప్రతిభావంతులైన క్రికెటర్లను కలిగిన భారత్ జట్టు గురించి తనకు పూర్తిగా తెలుసునని ఖబీర్ చెప్పాడు. ఇంకా టీం ఇండియా క్రికెటర్ల బలం ఏమిటో? బలహీనతలేంటో? బాగా తెలుసునని ఖబీర్ అన్నాడు. ఇటీవలే ముగిసిసన ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా టీం ఇండియా ఆటతీరుపై ఓ అంచనాకు వచ్చామని ఆప్ఘన్ కోచ్ వెల్లడించాడు.

ఇంకా చెప్పాలంటే..? భారత్‌కు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు ఇచ్చే షాక్‌ను ఐసీసీ తొలి మ్యాచ్‌ ముగిసినప్పటికీ ధోనీసేన మరిచిపోదని ఖబీర్ తెలిపాడు. అలాగే.. భారత జట్టుపై వ్యక్తిగతంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఆప్ఘనిస్థాన్ ఆల్-రౌండర్ ఖరీమ్ సద్ధీఖ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

Show comments