Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ప్రపంచకప్: శ్రీలంక జట్టులో జయసూర్య!

Webdunia
FILE
వెస్టిండీస్‌ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే శ్రీలంక జట్టును ఆ దేశ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఇందులో 40 ఏళ్ల స్టార్ క్రికెటర్ సనత్ జయసూర్యకు సెలక్టర్లు స్థానం కల్పించారు.

15 సభ్యులతో కూడిన ఈ జట్టులో జయసూర్యకు స్థానం కల్పించడంతో సెలక్టర్లు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. యువ క్రికెటర్లకు అవకాశాలిస్తారని అనుకున్న క్రికెట్ అభిమానులకు సెలక్షన్ కమిటీ సభ్యులు షాక్ ఇచ్చారు. కానీ డిసెంబరులో భారత్‌తో జరిగిన అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌లో జయసూర్య గట్టిపోటీని ప్రదర్శించడంతోనే అతనికి సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి.

కరేబియన్ గడ్డపై ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే లంక జట్టులో ఇంకా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేష్ చందిమల్, ఆల్-రౌండర్ తుషారా బొపరాలకు కూడా స్థానం దక్కింది.

జట్టు వివరాలు: సంగక్కర (కెప్టెన్), దిల్షాన్, జయసూర్య, జయవర్ధనే, చందిమల్, కపుగేదర, మాథ్యూస్, జయసింగే, పెరేరా, ముత్తయ్య మురళీధరన్, అజంతా మెండీస్, ఎస్. రందీవ్, ఎల్. మలింగ, వెలెగెదర, కులశేఖర.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments