Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టుల్లో సత్తా చాటుతాం: కెప్టెన్ ధోనీ

Webdunia
ఆదివారం, 15 మార్చి 2009 (12:26 IST)
ఈనెల 18వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభంకానున్న మూడు టెస్టుల్లో తమ సత్తా చాటుతామని "టీమ్ ఇండియా" కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, ఐదో వన్డేలో చిత్తుగా ఓడిపోవడం పట్ల క్రికెట్ అభిమానులకు ధోనీ క్షమాపణలు చెప్పాడు. పిచ్‌ను అంచనా వేయడంలో పొరపాటు పడటమే కాకుండా, చెత్త షాట్లు కొట్టడం వల్లే త్వరగా అవుట్ అయినట్టు వివరించాడు.

న్యూజిలాండ్ గడ్డపై ఐదు వన్డేల సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇందుకు జట్టులోని ప్రతి సభ్యునికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపాడు. సిరీస్ ఆరంభం నుంచి మంచి క్రికెట్ ఆడి, పోరాటస్ఫూర్తి ప్రదర్శించినందుకు జట్టు సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే, చివరి వన్డేలో క్రికెట్ అభిమానులను పూర్తి నిరాశకు లోనుచేయడం పట్ల క్షమాపణలు కోరుతున్నా అని ధోనీ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.

కివీస్ గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడాం. ఇకముందు కూడా ఇదే తరహా ప్రదర్శన కొనసాగిస్తే టెస్టుల్లో కూడా అద్భుతాలు సృష్టిస్తామని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం మూడు టెస్టులు జరుగుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments