Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి టెస్టు డ్రా... సిరీస్‌ విండీస్‌ కైవసం

Webdunia
ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల నడుమ జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ చివరకు డ్రాగా ముగిసింది. దీంతో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్‌ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవెల్‌లో జరిగిన మ్యాచ్ చివరి రోజు 240 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గేల్ సేన ఆట ముగిసే సమయానికి 114 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరకు అతి కష్టంమీద టెస్ట్‌ను డ్రాగా ముగించింది. ఫలితంగా... విండీస్ 11 సంవత్సరాల తరువాత ఇంగ్లండపై టెస్ట్ సిరీస్‌ను 1-0 ఆధిక్యంతో గెలుచుకుంది.

2000 సంవత్సరం తరువాత తొలిసారిగా విజ్డన్ ట్రోఫీని విండీస్ తిరిగీ దక్కించుకోగా... ఇలా చేతులదాకా వచ్చిన విజయం చేజారడం ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు రెండోసారి కావడం గమనించదగ్గ అంశం. మూడో టెస్టులోనూ విండీస్ టెయిలెండర్లు వీరోచితంగా పోరాడి జట్టును విజయపథంలో నడిపించారు.

కాగా, తొలి, రెండో ఇన్నింగ్స్‌లో వరుసగా సెంచరీ (131 నాటౌట్), హాఫ్ సెంచరీ (61) పూర్తి చేసిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ ప్రయర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే, విండీస్ బ్యాట్స్‌మెన్ శర్వాణ్‌ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments