Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జట్టు కోసం యూనిస్, ఇంతికాబ్ చూపులు

Webdunia
త్వరలో పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్‌కు సరికొత్త జట్టును ఎంపిక చేసుకునే దిశగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్, ఆ జట్టు కోచ్ ఇంతికాబ్ ఆలమ్ ఆసక్తి చూపుతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి అబుదాబి, దుబాయ్‌లలో పాక్-ఆసీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. ఇటీవల రద్దు అయిన బంగ్లాదేశ్ పర్యటన కోసం పాక్ చీఫ్ సెలక్టర్ అబ్దుల్ ఖాదిర్‌ సూచించిన 16 మంది సభ్యుల జట్టును కెప్టెన్, కోచ్‌ ఇద్దరు తోసిపుచ్చారు.

ఇదే జట్టును ఆస్ట్రేలియా పర్యటనకు కూడా చీఫ్ సెలక్టర్ సూచించగా, దీనికి వారిద్దరు ససేమిరా అన్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ముగించుకుని ఆస్ట్రేలియా జట్టు నేరుగా దుబాయ్‌కు చేరుకుంటుంది. ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా, ఇరు జట్లు ఒక ట్వంటీ-20 మ్యాచ్‌ను సైతం ఆడుతుంది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం పాక్ జట్టును ఏప్రిల్ ఒకటో తేదీన ఎంపిక చేస్తామని ఆలమ్ చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments