Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ వికెట్లపై ఆందోళన వద్దు : టేలర్

Webdunia
న్యూజీలాండ్ వికెట్లపై టీం ఇండియా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ దేశ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కివీస్‌లో పర్యటిస్తున్న టీం ఇండియా ముందుగా రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనున్న సంగతి పాఠకులకు విదితమే. ఇందులో తొలి ట్వంటీ20 మ్యాచ్ బుధవారం జరగనుంది.

ఈ నేపథ్యంలో మార్క్ టేలర్ మాట్లాడుతూ.. వికెట్లు ఎలా ఉంటాయన్న విషయంపైన టీం ఇండియా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. భారత్ గతంలో పర్యటించిన సమయంలో వికెట్లకు, ఇప్పటి వికెట్లకు చాలా తేడా ఉన్నాయనీ.. అదే విధంగా పిచ్ పరిస్థితులు కూడా ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయని వివరించాడు. కాగా, గత పర్యటనలో ఆడిన వన్డే, టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ అత్యధిక స్కోరు 219 పరుగులు మాత్రమే కావడం గమనించదగ్గ అంశం.

కివీస్‌లోని మైదానాల్లో పచ్చిక, వికెట్లపై సీమ్ కారణంగా టీం ఇండియా ఆటగాళ్లు బాధపడతారని తాను భావించటం లేదని టేలర్ అభిప్రాయపడ్డాడు. తమ దేశ క్రికెట్‌లో వచ్చిన అనూహ్య మార్పులు పిచ్ పరిస్థితులను పూర్తిగా మార్చి వేశాయని అన్నాడు. టీం ఇండియా ఆటగాళ్లు ఈ మార్పును తప్పకుండా గమనిస్తారని చెప్పాడు. ఇదిలా ఉంటే... ఆసీస్ వికెట్ల కంటే తమ వికెట్లపైనే బౌన్స్ తక్కువగా ఉంటుందని టేలర్ వెల్లడించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Show comments