న్యూజిలాండ్తో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆడే ఆస్ట్రేలియా జట్టులో ఆస్ట్రేలియా వైస్-కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్థానం దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు నుంచి తప్పుకుని, స్వదేశానికి ప్రయాణమైన క్లార్క్, కివీస్తో జరిగే టెస్టు మ్యాచ్లో ఆడుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ ప్రకటనలో తెలిపింది.
మార్చి 19వ తేదీ నుంచి న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్లో ఆడే ఆసీస్ జట్టును సీఏ నేషనల్ సెలక్షన్ ప్యానెల్ (ఎన్ఎస్పీ) బుధవారం ప్రకటించింది. కివీస్తో జరుగుతోన్న వన్డే సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాల ద్వారా తప్పుకున్న మైకేల్ క్లార్క్, టెస్టు సిరీస్కు అందుబాటులో ఉంటాడని ఎన్ఎస్పీ ఛైర్మన్ ఆండ్రూ హిల్డిచ్ చెప్పారు.
ఇంకా ఈ టెస్టు జట్టులో గాయం నుంచి కోలుకున్న ఆల్ రౌండర్ రియాన్ హారిస్, ఎడమచేతి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫిలిప్ హగ్స్లకు కూడా స్థానం లభించిందని హిల్డిచ్ తెలిపారు. అలాగే దేశవాళీ సర్క్యూట్లో ప్రతిభను కనబరిచిన 20 ఏళ్ల ఆల్ రౌండర్ స్టీవెన్ స్మిత్కు కూడా చోటు దక్కింది.