Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌: ధోనీసేన నిష్క్రమణ!

Webdunia
FILE
వెస్టిండీస్‌ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్ నుంచి భారత్ దాదాపుగా నిష్క్రమించింది. ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ 14 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా 2010 ఐసీసీ ప్రపంచకప్‌ను ధోనీసేన గెల్చుకుంటుందని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశనే మిగిలింది.

వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత 170 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది.

టీం ఇండియా జట్టులో సురేష్ రైనా (32) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ధోనీ (29) ఓ మోస్తారుగా రాణించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన విండీస్‌ కెప్టెన్‌ క్రిస్‌గేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

భారత బ్యాట్స్‌మెన్లు పేలవమైన ఆటతీరును ప్రదర్శించడంతోనే వెస్టిండీస్ చేతిలో భారత్ కంగుతింది. విండీస్ షార్ట్ పిచ్ బంతుల పరీక్షలకు నిలవలేక భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో, ధోనీసేనకు ఓటమి తప్పలేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments