Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీకి లీగల్ నోటీసు పంపిన పీసీబీ

Webdunia
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నోటీసులు పంపింది. తమ దేశంలో జరగాల్సిన మ్యాచ్‌లను చెప్పాపెట్టకుండా రద్దు చేయడంతో ఆగ్రహించిన పీసీబీ.. ఐసీసీకి లీగల్ నోటీసులు పంపుతున్నట్టు పేర్కొంది.

భద్రత కారణాల సాకుతో పాక్‌లో జరగాల్సిన ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను ఐసీసీ ఇతర దేశాలకు తరలించిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్‌ బోర్డు న్యాయ పోరాటానికి దిగింది. ఇందులో భాగంగానే ఐసీసీకి లీగల్ నోటీస్‌ను పంపించింది.

భద్రత కారణాలతో తమ దేశంలో జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేసిన ఐసీసీ అదే సమస్యను ఎదుర్కొంటున్న భారత్‌, శ్రీలంకలో మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తోందో వివరణ ఇవ్వాలని పీసీబీ కోరింది.

ఐసీసీ కావాలనే పాకిస్థాన్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేసిందని పాక్ క్రికెట్ బోర్డు ఆరోపించింది. భారత్‌, శ్రీలంకలో కూడా ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితి బాగలేదని, అయినా అక్కడ మ్యాచ్‌లను యథాప్రకారంగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించడం తమకు సమ్మతం కాదని పాక్ బోర్డు స్పష్టం చేసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments