ఐపీఎల్-7 పోటీల్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్ సన్రైజర్స్కు ఎంత కీలకమో, కోల్కతాకూ అంతే కీలకం.
గంభీర్ సారథ్యంలోని కోల్కతా ఆదిలో ఆపసోపాలుపడ్డా ఇప్పుడు నిలకడగా రాణిస్తోంది. వరుసగా పంజాబ్, ముంబైలపై సంచలన విజయాలతో ఊపుమీదున్న కోల్కతాకు ముకుతాడేయడం ధవన్సేనకు సవాలుగా మారింది.
ఆ జట్టులో ఉతప్ప, గంభీర్, యూసుఫ్ పఠాన్, మోర్నీ మోర్కెల్, నారాయణ్ల రూపంలో కీలక ఆటగాళ్లంతా మ్యాచ్లు సాగుతున్నకొద్దీ గాడిలోపడ్డారు. అన్నింటికి మించి సమిష్టిప్రతిభతో రాణించడం ఇప్పుడా జట్టుకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంటే, ప్రత్యర్థులకు దడపుట్టిస్తోంది.
మరోవైపు నాణ్యమైన ఆటగాళ్లతో పేపర్పై బలోపేతంగా కనిపిస్తున్నా, ఫీల్డ్లో మాత్రం తేలిపోవడం సన్రైజర్స్ హైదరాబాద్ను కలవరపరుస్తోంది.