Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-4లో సౌరవ్ గంగూలీ, ద్రావిడ్‌లకు గడ్డుకాలమే..!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌లకు గడ్డుకాలం తప్పదట. అదే వాస్తవమైతే మాత్రం వీరిద్దరూ ఇక ఆటగాళ్ల వేలంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది.

ఐపీఎల్ తొలి మూడు సీజన్లలో రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలు విఫలమవడంతో జట్టును ప్రక్షాళన చేయడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం నడుంబిగించింది. క్రిస్ గేల్ (అందుబాటులో ఉంటే) మినహా మరెవ్వరినీ కొనసాగించరాదని నిర్ణయించింది. దీంతో ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కారణంగా సహజంగానే గంగూలీని పక్కనబెట్టనున్నట్టు సమాచారం.

మరోవైపు దిగ్గజ హోదాలో గంగూలీకి రూ. 4.13 కోట్లు చెల్లించడం కంటే ఆటగాళ్ల వేలం ద్వారా ఈ మాజీ సారథిని కనీస ధర (రూ.92 లక్షలు)కు కొనుగోలు చేయాలని నైట్‌రైడర్స్ భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి రాహుల్ ద్రావిడ్‌కూ స్థానచలనం తప్పేట్టులేదు. ఐపీఎల్ కొత్త నియమావళిని అనుసరించి ఎంతమంది ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశముందో అంతమందికే కాంట్రాక్టును పొడిగించాలని బెంగళూరు నిర్ణయిస్తే రాహుల్ ద్రావిడ్ స్థానం ప్రశ్నార్థకమేనని వార్తలొస్తున్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments