Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3: పంజాబ్‌పై గిల్లీ సేన ఘన విజయం

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుపై డెక్కన్ ఛార్జర్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీ ఫైనల్ రేసులో నిలిచేందుకు ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో డీసీ సత్తా చాటుకుంది. ఈ విజయంతో మొత్తం 14 పాయింట్లను సాధించిన డీసీ జట్టు ఐపీఎల్-3 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

కాగా.. సముద్ర మట్టానికి 1457 మీటర్ల ఎత్తులో ధర్మశాలలో ఉన్న ఒకే ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో శుక్రవారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్, డెక్కన్ ఛార్జర్స్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన డీసీ కెప్టెన్‌ గిల్‌క్రిస్ట్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మహేల జయవర్ధనే 93 (నాటౌట్) పరుగులతో, సంగక్కర 52 పరుగులతో డీసీ బౌలర్లను పరుగులు పెట్టించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది.

అనంతరం 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ జట్టు ప్రారంభంలోనే కెప్టెన్ గిల్‌క్రిస్ట్ (9) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత మిశ్రా 20, సైమండ్స్ 4, మార్ష్ 15, సుమన్ 43 పరుగులతో రాణించారు. రోహిత్ శర్మ 68 (నాటౌట్) పరుగులతో మ్యాచ్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించటంతో "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అందుకున్నాడు. తాజా విజయంతో సెమీస్ దారిని సుగమం చేసుకున్న డీసీ ఆఖరి లీగ్ మ్యాచ్ ఏఫ్రిల్ 18న ఢిల్లీతో ఆడనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ATM కేంద్రంలో దొంగలు పడ్డారు... గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి డబ్బు కొట్టేశారు..

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

Vijayanagara King: శ్వేతశృంగాగిరిలోని తీర్థంలో స్నానం చేసిన కృష్ణదేవరాయలు.. తర్వాత?

అత్తతో అక్రమ సంబంధం.. యువకుడుని చితకబాది బలవంతపు పెళ్లి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాల్లో రాణించాలంటే ప్రతిభను నిరూపించుకోవాలి : హీరో మంచు మనోజ్

పాకిస్థానీ నటి హుమైరా అస్కర్ అలీ అనుమానాస్పద మృతి

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

Show comments