Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3: ఛాలెంజర్స్‌తో పంజూబ్ కింగ్స్ కీలక పోరు రేపే!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా చిట్ట చివరి స్థానంలో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ నటీమణి ప్రీతి జింటా జట్టు కింగ్స్ ఎలెవన్ జట్టుకు శుక్రవారం జరిగే మ్యాచ్ కీలకం కానుంది.

ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని నమోదు చేసుకున్న పంజాబ్ కింగ్స్‌, శుక్రవారం మొహాలీలో జరిగే మ్యాచ్‌లో నెగ్గితేనే సెమీస్ ఆశలను సజీవం చేసుకోగలుగుతుంది.

ప్రస్తుతం కేవలం రెండు పాయింట్లతో ఐపీఎల్ పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐపీఎల్ 31వ లీగ్‌ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్.. రాయల్స్‌తో హోరాహోరీగా పోటీపడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే మంగళవారం సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు పటిష్టంగా లేకపోవడం, యువరాజ్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించడం వంటి కారణాలతో కింగ్స్ ఈ మ్యాచ్‌లో నెగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఐపీఎల్ మూడో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించి, మూడో స్థానంలో కొనసాగుతోందన్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments