Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ సెమీస్ వేదికను ముంబైకి మార్చొద్దు..!: యడ్యూరప్ప

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ సెమీఫైనల్ మ్యాచ్‌ల వేదికను బెంగళూరు నుంచి ముంబైకి మార్పిడి చేయొద్దని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప కోరారు. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన పేలుళ్ల సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని యడ్యూరప్ప తెలిపారు.

ఇందుకోసం స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతను మరింత పటిష్టం చేస్తామని యడ్యూరప్ప ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విదేశీ ఆటగాళ్లతో పాటు స్టేడియం పరిధిలో బందోబస్తును పటిష్టం చేస్తామని ఐపీఎల్ యాజమాన్యానికి ముఖ్యమంత్రి తెలియజేశారు.

ఇదిలా ఉంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన 52వ లీగ్ మ్యాచ్‌కు ఒక గంట సేపు ముందు చిన్న స్వామి స్టేడియంలో జంట పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ పేలుళ్లలో పోలీసులతో పాటు 15 మంది గాయాలకు గురైయ్యారు. దీన్ని అనుసరించి స్టేడియం సమీప ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా.. అమ్మోనియం నైట్రేట్‌తో కూడిన రెండు బాంబులను నిర్వీర్యం చేశారు.

దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments