Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ బాగా ఉపయోగపడింది: ఓజా

Webdunia
దక్షిణాఫ్రికాలో ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో ఆడటం తనకు ఎంతో మేలు చేసిందని టీం ఇండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఆడటం ద్వారా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతర్జాతీయ ట్వంటీ- 20 క్రికెట్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన ప్రజ్ఞాన్ ఓజా ఐపీఎల్‌లో దక్కన్ ఛార్జర్స్ జట్టు తరపున ఆడిన సంగతి తెలిసిందే.

ప్రజ్ఞాన్ ఓజా బంగ్లాదేశ్‌తో జరిగిన ట్వంటీ- మ్యాచ్ ద్వారా ఐసీసీ ప్రపంచకప్‌లో ఆడాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్న ఓజా మాట్లాడుతూ.. ఆడిన తొలి అంతర్జాతీయ ట్వంటీ- 20 మ్యాచ్‌లోనే ఈ అవార్డు దక్కడంపట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చినందుకు ఆనందంగా ఉందన్నాడు.

జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం అంత సులభం కాదు. ఒకసారి జట్టులోకి వచ్చిన తరువాత నీ మీద బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. తనకు లోపల కొంత భయం ఉన్నప్పటికీ, ఐపీఎల్ తనకు ఎంతో ఉపయోగపడిందన్నాడు. ఐపీఎల్‌లో బౌలింగ్ చేయడంతో వలన నాలో ఆత్మవిశ్వాసం మెరుగుపడింది. ఇటీవల కాలంలో తాను పేస్‌‍లో వైవిధ్యం కనబరచగలుగుతున్నానని, ఇదే తన విజయ రహస్యమని ఓజా తెలిపాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments