Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ప్రత్యేక గుర్తింపు నిచ్చింది: మొహ్నీష్ మిశ్రా

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తనకు కొత్త గుర్తింపును సంపాదించి పెట్టిందని కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ మొహ్నీష్ మిశ్రా అన్నాడు. డెక్కన్ ఛార్జర్స్ తరపున ఐపీఎల్‌లో ఆడిన మొహ్నీష్ మిశ్రా.. ట్వంటీ-20 ఫార్మాట్‌లోని ఎన్నో మెలకువలను గ్రహించానని చెప్పాడు.

ఐపీఎల్‌లో ఆడటం ద్వారా సీనియర్ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నానని మిశ్రా అన్నాడు. స్టార్ క్రికెటర్లు అయిన ఆడమ్ గిల్‌క్రిస్ట్, గిబ్స్, ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి ఆడటం కొత్త అనుభూతినిచ్చిందని అతడు తెలిపాడు.

ఇప్పటివరకు ఆడిన 11 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 166 పరుగులు సాధించిన మిశ్రా.. వచ్చే ఏడాది కూడా డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడుతానని స్పష్టం చేశాడు.

ఇకపోతే.. కరేబియన్ గడ్డపై జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీం ఇండియా ధీటుగా రాణిస్తుందని మిశ్రా నమ్మకం వ్యక్తం చేశాడు. అలాగే అద్భుతమైన బ్యాటింగ్ లైన్‌అప్ కలిగిన భారత్‌కు కప్‌ను గెల్చుకునే సత్తా ఉందని మిశ్రా చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments