Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లు ఆడటంపై 14న నిర్ణయం!

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2011 (09:18 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొనడంపై ఈ నెల 14న జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ కొత్త ఛైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని రాజీవ్ శుక్లా చెప్పారు.

2008 ముంబయిపై ఉగ్రవాద దాడులు జరిగినప్పటినుంచి ఐపిఎల్‌లో పాక్ క్రికెటర్లు పాల్గొనకపోవడం తెలిసిందే. అయితే అంతమాత్రాన పాక్ క్రికెటర్లను ఐపిఎల్‌లో శాశ్వతంగా ఆడనివ్వమని అర్థం కాదని శుక్లా స్పష్టం చేశారు. దీనిపై పాలక మండలి నిర్ణయం తీసుకోవలసి ఉందని వెల్లడించారు.

పాకిస్తాన్ రిఫరీల సేవలను ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నాం. కొన్ని జట్ల ఫ్రాంచైజీలు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లను కోచ్‌లుగా కూడా తీసుకున్నాయి. అందువల్ల మొత్తంగా పాకిస్తాన్‌ను నిషేధించామని చెప్పడం సరికాదు. ఎవరినీ నిషేధించే ప్రసక్తే లేదు’ అని శుక్లా తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments