Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌పై దృష్టి పెట్టడం ముఖ్యం : ధోనీ

Webdunia
ప్రపంచకప్ సన్నాహకాల కోసం న్యూజిలాండ్‌తో జరిగే ట్వంటీ20 మ్యాచ్‌లకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై దృష్టి పెట్టడమే మంచిదని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఈ విషయమై ధోనీ మాట్లాడుతూ... ప్రతి మ్యాచ్ ముఖ్యమైనప్పటికీ... వరల్డ్ కప్‌ సన్నాహకం కోసం కివీస్‌తో జరిగే అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్‌లకంటే, ఐపీఎల్‌పై దృష్టి పెట్టడమే ముఖ్యమని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టీం ఇండియా క్రికెటర్లకు మాత్రమే కాకుండా, టోర్నీలో ఆడుతున్న ఇతర క్రికెటర్లకు కూడా సహాయపడుతుందన్నాడు.

ప్రపంచకప్ జరిగేందుకు ఇంకా చాలా సమయం ఉందనీ... ప్రస్తుతం జరిగే రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు అప్పటికి సహాయపడతాయని తాను అనుకోవడం లేదని ధోనీ చెప్పారు. కాగా, వరల్డ్‌కప్‌కు ముందు టీం ఇండియాకు న్యూజిలాండ్‌తో జరిగే రెండు ట్వంటీ20 మ్యాచ్‌లే చివరివి కావడం గమనార్హం.

ఇక కివీస్ సిరీస్ గురించి ధోనీ మాట్లాడుతూ... మాజీ టీం ఇండియా కోచ్ జాన్‌రైట్ సలహాలు ఆతిథ్య జట్టుకు మేలు చేస్తాయని అన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా, కోచ్‌గా రైట్ అనుభవజ్ఞుడని, అతడికి భారత జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి మనస్తత్వం బాగా తెలుసని చెప్పాడు. ఈ సమాచారం కివీస్‌కు ఎంతగానో మేలు చేస్తుందనీ, సమిష్టి కృషికి పెట్టింది పేరైన కివీస్ ఏ ఒక్క ఆటగాడిపైనా ఆధారపడదని ధోనీ ప్రశంసించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హానీట్రాప్‌లో పడిపోయాడు.. ఆర్మీ సీక్రెట్లు చెప్పేశాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..

చెల్లి స్నానం చేస్తుండగా చూశాడనీ వెల్డర్‌ను చంపేసిన సోదరుడు..

వైకాపా నేతలు సిమెంట్ - పేపర్ వ్యాపారాలు మానేస్తే.. సినిమాలను వదులుకుంటా : పవన్ కళ్యాణ్

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

Show comments