Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టులో శ్రీలంకలో పర్యటించనున్న పాక్ క్రికెట్ టీం

Webdunia
ఆదివారం, 18 మే 2014 (14:52 IST)
File
FILE
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే ఆగస్టు నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలను పాక్ జట్టు ఆడనుంది. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిపిన తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించడానికి ఏ జట్టూ ముందుకు రాని విషయం తెల్సిందే. ఫలితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తటస్థ వేదికగా చేసుకొని పాక్ జట్టు హోం సిరీస్‌లు ఆడుతూ వస్తోంది.

పూర్తి స్థాయి సిరీస్‌లు ఆడే అవకాశాలు లభించకపోయినా, అందుబాటులోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పిసిబి ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే శ్రీలంక టూర్‌ను ఖాయం చేసుకున్నట్టు పిసిబి ప్రకటించింది.

శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి)తో అవగాహన కుదిరిందని, లంకలో పాక్ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడుతామని పీసీబీ అధికారి ప్రకటించాడు. ఈ టూర్‌లో భాగంగా ఆగస్టు 6 నుంచి గాలేలో తొలి టెస్ట్, 14 నుంచి కొలంబోలో రెండో టెస్టు మొదలవుతుంది. అదేవిధంగా మూడు వన్డేలు ఆగస్టు 23, 27, 30 తేదీల్లో నిర్వహిస్తారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments