టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించాడు. రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ బౌలింగ్కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జడుసుకున్నాడని తన బయోగ్రఫీలో రాసుకోవడం పట్ల గంగూలీ నోరు విప్పాడు. మాస్టర్ బ్లాస్టర్ ఏ బౌలర్ను చూసి భయపడింది లేదని గంగూలీ తెలిపాడు.
అక్తర్ ఆటోబయోగ్రఫీలో వచ్చిన వ్యాఖ్యలు సరికావని గంగూలీ చెప్పాడు. అక్తర్ ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడంతో కాస్త నిరాశకు గురైయ్యాను. అంతేకాకుండా షాక్ తిన్నా. షోయబ్ అక్తర్ గ్రేట్ బౌలరే.
కానీ సచిన్ క్రీజులో ఉన్నప్పుడు ఏ బౌలర్ను చూసి జడుసుకున్నది లేదని గంగూలీ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సచిన్.. అక్తర్ను చూసి భయపడ్డాడన్నది పెద్ద జోక్ అని దాదా వ్యాఖ్యానించాడు.