యువరాజ్ సింగ్ టీ-20ల్లో ఆడబోతున్నాడోచ్!

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (12:46 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ-20లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు యువరాజ్ సింగ్‌తో గ్లోబల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.


ఇటీవల భారత క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ ముంబైలో కన్నీటితో వీడ్కోలు తెలిపాడు. బాగా ఆలోచించాకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించాడు. ఆపై బీసీసీఐకి కూడా యువరాజ్ సింగ్ లేఖ కూడా సమర్పించాడు. 
 
ఈ లేఖలో టీ-20 సిరీస్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. అయితే బీసీసీఐ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ టీ-20 సీజన్‌లో ఆడేందుకు యువరాజ్ సింగ్‌కు ఒప్పందం కుదిరింది. 
 
కెనడాలో జరుగనున్న గ్లోబల్ టీ-20 సిరీస్‌లో టొరాంటో నేషనల్స్ జట్టు కోసం యువరాజ్ సింగ్ ఆడనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఆరు జట్లు కలిగిన ఈ సిరీస్‌లో ఒక్కో జట్టులో నలుగురు కెనడా క్రికెటర్లు పాల్గొంటారు. ఈ రెండో సీజన్ 25వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments