Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవిశాస్త్రి, కోహ్లీ పెట్టిన యోయో టెస్టే నా కొంపముంచింది.. యువరాజ్ సింగ్

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (14:52 IST)
టీమిండియాలో చోటు కోల్పోవడానికి యోయో టెస్టే కారణమని, దాంట్లో పాస్ కాలేకపోవడం వల్లే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశానని స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. అయితే, ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉంటే మాత్రం తన పరిస్థితి వేరేలా ఉండేదని, తన క్రికెట్ కెరీర్‌ను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చేది కాదని యువరాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 
 
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్‌ కోహ్లీ హయాంలోనే యోయో టెస్టును ప్రారంభించడాన్ని యువరాజ్ సింగ్ పరోక్షంగా విమర్శించాడు. క్రికెటర్ బాగా ఆడుతుంటే ఆ టెస్టుతో పనేంటని నిలదీశాడు. సౌరవ్ గంగూలీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఆటగాళ్ల అవసరాలను అర్థం చేసుకునే విజయవంతమైన సారథి అని కితాబిచ్చాడు. గంగూలీని తాను దూరదృష్టి గలవాడిగా భావిస్తున్నాను. 
 
అతను దేశవాళీ క్రికెట్ స్థితిని కూడా మెరుగుపరచగలడని తాను ఆశిస్తున్నానని యువరాజ్ సింగ్ తెలిపాడు. కాగా, కేన్సర్‌ ను జయించి క్రికెట్‌లోకి మళ్లీ వచ్చాక యువీ యోయో టెస్ట్‌ పాస్‌ కాలేదంటూ జట్టులోకి తీసుకోలేదన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments