వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో భారత్‌కు ఓటమి తప్పదా? కివీస్ టార్గెట్ 139

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (19:27 IST)
ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో భారత క్రికెట్ జట్టు ఓటమి దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. రిజర్వు డే అయిన ఆరో రోజున టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ మినహా మిగిలిన వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం కేవ‌లం 170 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 
 
న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 32 ప‌రుగుల ఆధిక్యం ల‌భించ‌డంతో ఆ టీమ్ ముందు కేవ‌లం 139 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మాత్రం ఉంచింది. బౌల‌ర్లు స‌మ‌ష్టిగా రాణించ‌డంతోపాటు కేన్ విలియ‌మ్స‌న్ అద్భుత‌మైన కెప్టెన్సీ ముందు ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ నిల‌వ‌లేక‌పోయారు. 
 
టాప్‌, మిడిలార్డ‌ర్ దారుణంగా విఫ‌ల‌మైంది. రిష‌బ్ పంత్ మాత్రమే 41 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయితే అత‌డు కూడా కీల‌క‌మైన స‌మ‌యంలో చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. కివీస్ బౌల‌ర్ల‌లో సౌథీ 4, బౌల్ట్ 3, జేమీస‌న్ 2, వాగ్న‌ర్ 1 వికెట్ తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments