చీఫ్ సెలెక్టర్ పదవికి ఇంజమామ్ హల్ హక్ గుడ్‌బై...

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (22:14 IST)
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ సెలెక్టర్ పదవికి ఆ దేశ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ హల్ హక్ రాజీనామా చేశారు. భారత్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 కోసం పాకిస్థాన్ జట్టు ఎంపిక సక్రమంగా జరగలేదన్న ఆరోపణలతో పాటు విమర్శలు వస్తున్నాయి. వీటిని నిజం చేసేలా మైదానంలో పాక్ ఆటగాళ్ళ ఆటతీరు కూడా ఉంది. పైగా, ఆ జట్టు వరుస ఓటములను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
 
పీసీసీ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఇంజమామ్ హల్ హక్.. తన రాజీనామా లేఖను పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్‌కు పంపించారు. ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపిక ప్రక్రియ సరిగా జరగలేదని, జట్టు ఎంపికలో వర్గపోరు నడిచిందంటూ స్వదేశంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ విమర్శల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఇంజమామ్ హల్ హక్ ప్రపంచ కప్ జరుగుతుండగానే తన పదవికి రాజీనామా చేశాడు. మరోవైపు, జట్టు ఎంపికపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించేందుకు పీసీబీ సిద్ధమైంది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మీడియాలో వచ్చిన ఆరోపణలపై పీసీబీ పారదర్శకంగా విచారణ చేపట్టేందుకు వీలుగా తన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఇంజమామ్ తెలివిగా ఓ కారణాన్ని చూపడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments