Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్‌లో టీమిండియాదే టైటిల్: మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్

Webdunia
మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (19:13 IST)
వరల్డ్ కప్‌లో టీమిండియాదే టైటిల్ అని మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2011లో గెలుచుకున్న టైటిల్‌ను టీమిండియా నిలబెట్టుకుంటుందని గ్యారీ కిర్ స్టెన్ చెప్పారు.

ఎవరెన్ని కథనాలు రాసినా, రాయకపోయినా... టీమిండియా విజయం మాత్రం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలను ఆయన మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణించారు. 
 
‘‘టీమిండియా టైటిల్‌ను నిలబెట్టుకుని తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బలమైన బ్యాంటింగ్ లైనప్ వారి సొంతం. నాకౌట్ దశలో ఎలా ఆడాలన్న విషయం వారికి తెలుసు. 2011లో వారి ప్రదర్శన అద్భుతం’’ అని కిర్ స్టెన్ వ్యాఖ్యానించారు.
 
మరోవైపు భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు హర్భజన్ సింగ్, వరల్డ్ కప్‌కు వెళ్లిన టీమిండియా జట్టు కూర్పుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో సరైన ఆటగాళ్లే ఉన్నారన్న అతడు, జట్టులోని సభ్యులంతా సత్తా గలవారేనని వ్యాఖ్యానించాడు. ఈసారి వరల్డ్ కప్ కూడా భారత్ దేనని భజ్జీ తెలిపాడు.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments