ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా శనివారం ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్లు ఫీల్డ్ అంపైర్లు రద్దు చేసి, ఇరు జట్లకు తలో పాయింట్ కేటాయించారు.
బ్రిస్బేన్ వేదికగా ఈ ఇరు జట్ల మధ్య డే అండ్ నైట్ మ్యాచ్ జరగాల్సి వుంది. అయితే, ఈ ప్రపంచ కప్ పోటీలకు వరుణుడు తొలిసారి అడ్డుతగిలాడు. ఫలితంగా మ్యాచ్ రద్దు అయినట్టు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
శనివారం ఉదయం నుంచి వర్షం తగ్గకుండా పడుతూ ఉండటంతో, కనీసం 20 ఓవర్ల మ్యాచ్నైనా జరిపించాలని అంపైర్లు భావించారు. వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో, మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు పూల్ ఏలో 3 విజయాలతో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లు తదుపరి కొనసాగుతున్నాయి.