Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ఐపీఎల్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్.. కరోనా కాలంలో సూపర్ క్రికెట్ టోర్నీ

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (14:14 IST)
మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా కష్ట కాలంలో ఈ ఏడాది లీగ్‌ జరుగుతుందా లేదా అనే అనుమానాలను బీసీసీఐ పటాపంచలు చేసింది. నవంబరు 1 నుంచి 10 వరకు యూఏఈలోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. చాలెంజర్‌ సిరీస్‌ పేరిట ఈ టోర్నీ జరుగనుంది. 
 
మహిళల టోర్నీలో గతేడాదిలాగే మూడు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీ కన్నా ముందే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న మహిళా క్రికెటర్లకు శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ షెడ్యూల్‌ మధ్యలో చాలెంజర్‌ సిరీస్‌ను జరుపుతాం. అలాగే కరోనా వైరస్ కారణంగా జాతీయ క్రికెట్‌ శిబిరం మూతబడింది కాబట్టి మహిళల ఐపీఎల్‌ కన్నా ముందే వారికి శిబిరం ఏర్పాటు చేస్తామని సౌరవ్ గంగూలీ చెప్పారు. 
 
యూఏఈలో మహిళల ఐపీఎల్‌నూ నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయం పట్ల భారత మహిళల వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచకప్‌ కోసం మా సన్నాహం ఎట్టకేలకు ఆరంభం కానుంది. బీసీసీఐ, సౌరవ్ గంగూలీ, జై షాలకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ కూడా బీసీసీఐ బాస్ గంగూలీ, బీసీసీఐలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments