Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ కొత్త రూల్ : యూఎస్ఏకు 5 పరుగుల జరిమానా!!

వరుణ్
గురువారం, 13 జూన్ 2024 (09:50 IST)
అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సాఫీగా సాగిపోతుంది. ఈ టోర్నీలో భాగంగా, భారత్ - అమెరికా జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ కీలక దశలో అనూహ్య పరిణామం జరిగింది. లక్ష్య ఛేదనలో భారత్‌కు 30 బంతుల్లో 35 పరుగులు అవసరమైన దశలో భారత విజయం లక్ష్యం నుంచి 5 పరుగులను అకస్మాత్తుగా తగ్గించారు. పరుగులు రాబట్టడం క్లిష్టంగా మారిన నసావు కౌంటీ పిచ్‌పై సాధించాల్సిన పరుగుల్లో 5 తగ్గడం భారత్‌కు కలిసొచ్చింది. ఇదేసమయంలో ఆతిథ్య అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
 
ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. మ్యాచ్ ఓవర్ల మధ్య సమయం 60 సెకండ్లకు మించకూడదు. ఒక్క నిమిషం వ్యవధిలోనే తదుపరి ఓవర్ మొదలు కావాల్సి ఉంటుంది. దీనిని 'స్టాప్ క్లాక్ రూల్' అని అంటారు. ఈ విషయంలో ఫీల్డింగ్ జట్టు చాలా అప్రమత్తంగా ఉండాలి. 60 సెకన్లలోనే కొత్త ఓవరు మొదలు పెట్టాలనే నిబంధనను ఇన్నింగ్స్ మూడు సార్లు అతిక్రమిస్తే ఆ జట్టు స్కోరు నుంచి 5 పరుగుల పెనాల్టీని విధిస్తారు. అంటే ఆ జట్టు మొత్తం స్కోర్ నుంచి 5 పరుగులను తగ్గిస్తారు. అమెరికా వర్సెస్ భారత్ మ్యాచ్‌లోనూ జరిగింది ఇదే. అమెరికా మొత్తం 110 పరుగులు సాధించగా అందులో 5 పరుగులు సాధించాడు. దీంతో భారత్ విజయ లక్ష్యం 106 పరుగులకు తగ్గింది. దీంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే భారత్ సునాయాసంగా విజయం సాధించింది.
 
కాగా, 5 పరుగులు పెనాల్టీగా విధించడంతో అమెరికా ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఆరోన్ జోన్స్ ఆన్-ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ వద్దకు వెళ్లి మాట్లాడాడు. కొత్త నిబంధన గురించి వివరించడంతో అసంతృప్తితో వెనుదిరిగాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరేళ్ల బాలికపై దుండగుడు అత్యాచార యత్నం: కాపాడిన వానర దండు

కేరళలో రెండో మంకీపాక్స్ కేసు.. రోగికి క్లాడ్ 1బి వైరస్ సోకింది..

రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. చిన్నపిల్లాడిపై దాడి.. అమ్మ ఎలా కాపాడిందంటే? (Video)

శ్రీవారి లడ్డూలో ఏమైనా కలిపివుంటే నేను.. నా కుటుంబం సర్వనాశనమైపోతాం... భూమన (Video)

ఫ్రిడ్జ్‌లో మహిళ శరీర అవశేషాలు.. ఒకే వ్యక్తి చంపాడా? ఎందుకు? ఆ వ్యక్తి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూతో బన్నీకి, సుక్కూకు సంబంధం లేదు.. రవి

మా అన్నయ్య సూర్య నీకే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయ్.. అంటూ హగ్ చేసుకున్నారు : కార్తీ

చక్కటి జానపద సాహిత్యం, రసానుభూతి కలిగించేలా ప్రణయ గోదావరి గీతం : చంద్రబోస్‌

2025 ఆస్కార్‌ అవార్డు కోసం అమీర్ ఖాన్ మాజీ భార్య లాపతా లేడీస్

కిలాడీ కుర్రోళ్ళు అంటూ రాబోతోన్న గౌతం రాజు తనయుడు కృష్ణ

తర్వాతి కథనం
Show comments