Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన ఇద్దరు విండీస్ క్రికెటర్లు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (17:39 IST)
ఇద్దరు వెస్టిండీస్ క్రికెటర్లు తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పారు. వీరిద్దరూ ఒకే రోజు ప్రకటించారు. వారిలో ఒకరు విండీస్ మాజీ సారథి దానేష్ రామ్‌దిన్ కాగా, మరొకరు స్టార్ బ్యాటర్ లెండి సిమన్స్ ఉన్నారు. 
 
గత 2019లో చివరిసారిగా టీ20 క్రికెట్ ఆడిన రామ్‌దిన్.. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని, ఇకపై ప్రాంచైజీ క్రికెట్ మాత్రమేనని ఆడుతానని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు సంతోషంగా ప్రకటిస్తున్నా. గడిచిన 14 యేళ్ళు నా కల నిజం చేసింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోతో పాటు వెస్టిండీస్ ఆడాలన్న నా చిన్ననాటి కల నెరవేరింది. నా కెరీర్‌లో ప్రపంచాన్ని చూసే అవకాశం లభించింది. వేరు వేరు సంప్రదాయాల వాళ్ళను కలిసినా నేను పుట్టిన గడ్డపై గౌరవం మాత్రం ఏమాత్రం తగ్గలేదు" అని పేర్కొన్నారు. 
 
మరోవైపు, లెండి సిమన్స్ కూడా అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. సీపీఎల్‌లో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రింబాగో నైట్ రైడర్స్‌ తమ ట్విట్టర్ ఖాతాలో ముందుగా ఈ విషయాన్ని వెల్లడించారు. సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments