క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన ఇద్దరు విండీస్ క్రికెటర్లు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (17:39 IST)
ఇద్దరు వెస్టిండీస్ క్రికెటర్లు తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పారు. వీరిద్దరూ ఒకే రోజు ప్రకటించారు. వారిలో ఒకరు విండీస్ మాజీ సారథి దానేష్ రామ్‌దిన్ కాగా, మరొకరు స్టార్ బ్యాటర్ లెండి సిమన్స్ ఉన్నారు. 
 
గత 2019లో చివరిసారిగా టీ20 క్రికెట్ ఆడిన రామ్‌దిన్.. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని, ఇకపై ప్రాంచైజీ క్రికెట్ మాత్రమేనని ఆడుతానని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు సంతోషంగా ప్రకటిస్తున్నా. గడిచిన 14 యేళ్ళు నా కల నిజం చేసింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోతో పాటు వెస్టిండీస్ ఆడాలన్న నా చిన్ననాటి కల నెరవేరింది. నా కెరీర్‌లో ప్రపంచాన్ని చూసే అవకాశం లభించింది. వేరు వేరు సంప్రదాయాల వాళ్ళను కలిసినా నేను పుట్టిన గడ్డపై గౌరవం మాత్రం ఏమాత్రం తగ్గలేదు" అని పేర్కొన్నారు. 
 
మరోవైపు, లెండి సిమన్స్ కూడా అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. సీపీఎల్‌లో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రింబాగో నైట్ రైడర్స్‌ తమ ట్విట్టర్ ఖాతాలో ముందుగా ఈ విషయాన్ని వెల్లడించారు. సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments