Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక చేతిలో ఓటమి భారతకు మేలు కొలుపు : వసీం అక్రమ్‌

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (11:59 IST)
సొంత గడ్డపై పర్యాటక శ్రీలంక క్రికెట్ జట్టు చేతిలో భారత జట్టుకు ఎదురైన ఓటమి ఆ జట్టుకు మేలు కొలుపు వంటిందని పాకిస్థాన్ క్రికెట్ లెజండ్ వసీం అక్రమ్ అన్నారు. పూణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత ఓడిపోయిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ... భారత్ - శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ ఫలితం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 
 
లంక చేతిలో టీమిండియా ఓడడంతో నేను షాకయ్యాను. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టిన ధోనీసేన స్వదేశంలో లంక చేతిలో భంగపడింది. పుణెలో మాత్రం పచ్చికతో నిండిన వికెట్‌పై అనుభవరాహిత్య లంక బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోలేకపోయింది. టీ20 ప్రపంచ కప్‌ ఫేవరెట్‌ భారతకు ఈ పరాజయం ఓ మేలు కొలుపు. తొలి టీ20లో ధోనీసేన అలవోకగా గెలుస్తుందని భావించా. అయితే లంక యువ పేసర్లు రజిత, షనక నిప్పులు చెరగడంతో పటిష్ట భారత బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. వీర్దిదరూ చెరో 3 వికెట్లతో భారతను కోలుకోలేని దెబ్బతీశారని గుర్తు చేశారు. 
 
అశ్విన మాత్రం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిశాడు. ఒత్తిడిలో రాణించినప్పుడే ఆటగాళ్ల సత్తా తెలుస్తుంది. ఇక రాంచీలో ఫ్లాట్‌ పిచపై ధోనీసేన పుంజుకునే చాన్స ఉంది. ఇక్కడ లంకకు కష్టాలు తప్పకపోవచ్చు. కానీ ఆ జట్టును తక్కువగా అంచనావేస్తే మరోసారి మూల్యం చెల్లించక తప్పదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మెరుగ్గా ఉన్న లంక గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments