Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్స్ ఎలెవన్ జట్టుకు మెంటర్‌గా సెహ్వాగ్: కొత్త బాధ్యతలు అప్పగించిన ప్రీతిజింటా!

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (13:04 IST)
ఢిల్లీ హీరో, మాజీ టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహయజమానికి కొత్త బాధ్యతలు అప్పగించారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడిగా రాణించిన వీరేంద్రుడు ఇక మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్‌కు సెహ్వాగ్ సహాయకుడిగా వ్యవహరించనున్నాడు. 
 
దీనిపై బంగర్ మాట్లాడుతూ.. గత రెండు సీజన్లలో సెహ్వాగ్ బ్యాట్స్‌మన్‌గా జట్టులో స్ఫూర్తినింపాడని తెలిపాడు. ప్రస్తుతం మెంటర్‌గా అతని సలహాలు, సూచనలతో జట్టుకు ప్రయోజనాలు చేకూరుతాయని ఆశించాడు. సెహ్వాగ్ నియామకం జట్టును మరింత పటిష్ఠం చేస్తుందని బంగర్ ఆకాంక్షించాడు.
 
దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. కొత్త ఫ్రాంచైజీలో కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పాడు. తనకు కింగ్స్ ఎలెవన్ తరపున లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపాడు. కింగ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments