సిడ్నీ క్రికెట్ స్టేడియంలో అనుష్కతో కోహ్లీ.. ఇదే నా బెస్ట్ అచీవ్‌మెంట్

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (13:18 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా - భారత్ క్రికెట్ చరిత్రలో 72 యేళ్ల టీమిండియా కలను సాకారం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను తన కెప్టెన్సీలో కైవసం చేసుకున్నాడు. ఈ మధురక్షణాలను కోహ్లీ తన భార్య, సినీ నటి అనుష్క శర్మతో కలిసి ఆస్వాదించాడు. 
 
వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయినట్టు అంపైర్లు ప్రకటించిన వెంటనే టీమిండియా జట్టు మైదానంలోకి వచ్చింది. వారితో పాటు కోహ్లీ తనతో పాటు తన సతీమణిని కూడా మైదానంలోకి తీసుకొచ్చి, స్టేడియం మొత్తం కలియతిరుగుతూ సందడి చేశారు. అనుష్క భుజాలపై కోహ్లీ రెండు చేతులు వేసి స్టేడియంలో నడుచుకుంటూ కెమెరాలకు చిక్కాడు.
 
ఈ విజయంపై కోహ్లీ స్పందిస్తూ, ఈ విజయం తన జీవితంలో బెస్ట్ అచీవ్‌మెంట్ అంటూ పేర్కొన్నాడు. కాగా, ఈ పర్యటనలో కోహ్లీ ఒక సెంచరీతో పాటు 282 పరుగులు చేసిన విషయం తెల్సిందే. భారత క్రికెట్ జట్టును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఇదివరకు ఎపుడూ ఇలాంటి మూమెంట్‌ను చూడలేదు. టీమిండియాను లీడ్ చేస్తూ ఇలాంటి చారిత్రక విజయం సాధించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ క్షణాలను తప్పకుండా మేం ఎంజాయ్ చేస్తాం అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments