Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజున గదుల్లో ఒంటరిగా ఉండటం కంటే ఫ్యామిలీతో ఉండటానికి ఇష్టపడతా : విరాట్ కోహ్లి

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (10:44 IST)
మైదానంలో కష్టంగా గడిపిన రోజున హోటల్ గదిలో ఒంటరిగా ఉండటం కంటే కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు తాను ఇష్టపడతానని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డారు. అందువల్ల భారత క్రికెట్ జట్టు సభ్యుల పర్యటనల సమయంలో వారి వెంట వారి కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో 1-3 ఓటమి తర్వాత కుటుంబ సభ్యులతో భారత క్రికెటర్లు ఉండే సమయాన్ని బీసీసీఐ తగ్గించింది. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. 
 
బీసీసీఐ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 45 రోజులకు మంచిన పర్యటనలో కుటుంబ సభ్యులు క్రికెటర్లతో రెండు వారాలకు మించి ఉండటానికి వీలు లేదు. ఇక చిన్న పర్యటనల్లో మాత్రం వారం వరకు ఉండొచ్చు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోహ్లి, జడేజా, షమి, వారి కుటుంబ సభ్యులతో ఉన్నారు. కానీ, వాళ్లు జట్టు హోటల్‌లో లేకుండా వాళ్ల ఖర్చులను క్రికెటర్లే భరించారు. 
 
"కుటుంబ సభ్యుల పాత్ర ఎలాంటిదో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. మైదానంలో తీవ్ర పోటీ తర్వాత వాళ్లతో గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. అలా చేయడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో ప్రజలకు తెలుసని నేను అనుకోను. నా రూమ్‌కు వెళ్లి ఒంటరిగా చిరాకుగా కూర్చుకోవాలనుకోను. సాధారణంగా ఉండాలనుకుంటాను. కుటుంబంతో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కుటుంబ సభ్యులతో ఉంటే సంతోషంగా ఉంటుంది. వాళ్లతో ఉండటానికి వీలు కల్పించే ఏ చిన్న అవకాశాన్ని కూడా నేను వదిలిపెట్టను అని కోహ్లి చెప్పుకొచ్చాడు. 
 
అంతేకాకుండా, క్రికెటర్లకు సంబంధించిన ఈ విషయాలతో సంబంధం లేని వ్యక్తులు అనవసర చర్చలు చేయడం, కుటుంబాలను దూరంగా ఉండాలనడం నిరాశ కలిగిస్తోందని కోహ్లి చెప్పాడు. ప్రతి ఆటగాడు కుటుంబం తనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటాడని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments