Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి అరుదైన గౌరవం.. వరుసగా మూడోసారి విస్డన్‌లో చోటు..

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:15 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. విరాట్ కోహ్లీని వరుసగా మూడోసారి విస్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించడం జరిగింది. ఇంకా ప్రపంచంలోనే లీడింగ్ క్రికెటర్‌గానూ కోహ్లీని ప్రకటిస్తూ విస్డన్ పత్రిక గౌరవించింది. ప్రతి ఏడాది ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ల జాబితాను విడుదల చేసే ఇంగ్లండ్ మాస పత్రిక విస్డన్.. ఈ ఏడాది విరాట్ కోహ్లీని ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో టాప్-5లో స్థానం కల్పించింది. 
 
గత ఏడాది ఐసీసీకి చెందిన టెస్టు, వన్డేల్లో అత్యుత్తమ క్రికెటర్ అవార్డులను గెలుచుకున్న కోహ్లీ, 2018లో అన్నీ ఫార్మాట్‌లలో 11 శతకాలు సాధించాడు. దీంతో 2, 735 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో విస్డన్ జాబితాలో కోహ్లీ స్థానం సంపాదించుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన జాస్ బట్లర్, శామ్ కుర్రాన్, రోరీ ఫర్న్స్, ఇంగ్లండ్ మహిళా జట్టు డేమీలు ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 
 
దీనిపై విస్డన్ ఎడిటర్ లారెన్స్ మాట్లాడుతూ.. 2014లో మాత్రం కాస్త తడబడిన కోహ్లీ.. అటుపిమ్మట టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడని కొనియాడారు. ఇదేవిధంగా విస్డన్ జాబితాలో భారత మహిళా క్రికెటర్ స్మృతి మందనకు కూడా చోటు దక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments